T20 World Cup 2025 : భారత మహిళా క్రికెటర్లు మరో ఐసీసీ ట్రోఫీని అందుకున్నారు. హర్మన్ప్రీత్ కౌర్ సేన వన్డే ప్రపంచ కప్ను సగర్వంగా ముద్దాడి నెల దాటక ముందే అంధ మహిళల జట్టు (Blind Cricket Team) చరిత్ర సృష్టించింది. టీ20 వరల్డ్ కప్ తొలి సీజన్లోనే ఛాంపియన్గా అవతరించింది. టోర్నీ ఆసాంతం గొప్పగా ఆడిన టీమిండియా ఆదివారం ఫైనల్లో నేపాల్ను చిత్తు చేసింది. ప్రత్యర్ధిని 114కే కట్టడి చేసిన భారత్.. 13 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించి విజేతగా నిలిచింది. ఓపెనర్ ఫులా సరేన్ (44) దంచేయగా అలవోక విజయంతో కప్ను పట్టేసింది దీపికా టీసీ బృందం.
అంధ మహిళల టీ20 ప్రపంచ కప్ను భారత జట్టు కొల్లగొట్టింది. కొలంబోలోని సరా ఓవల్ మైదానంలో చెలరేగిన టీమిండియా భారీ విజయంతో తొలి విజేతగా అవతరించింది. సెమీఫైనల్లో ఆస్ట్రేలియాను చిత్తు చేసిన భారత్ ఫైనల్లోనూ అదే జోరు చూపించి నేపాల్ను వణికించింది. టాస్ గెలిచిన కెప్టెన్ నేపాల్ను బ్యాటింగ్కు ఆహ్వానించింది. బౌలర్లు విజృంభించగా ప్రత్యర్ధిని 114కే పరిమితం చేసింది.
India creates history! 🇮🇳
Our women’s blind cricket team defeats Nepal to win the Women’s Blind World Cup title! 🏆
A proud moment celebrating courage, talent and determination. Congratulations, Team India! 🇮🇳💙 @narendramodi @BCCI #INDvsNEP #Final #BlindCricket #TeamIndia pic.twitter.com/riVQZqqxLH
— Differently Abled Cricket Council of India (@dcciofficial) November 23, 2025
అనంతరం ఛేదనలో భారత బ్యాటర్లు దంచేశారు. ఓపెనర్ ఫులా సరేన్ (44) మెరుపులతో పది ఓవర్లకే స్కోర్ వంద దాటింది. మరో మూడు ఓవర్లలోనే లక్ష్యాన్ని చేరుకున్న భారత్.. 7 వికెట్ల తేడాతో జయభేరి మోగించింది. ఆరంభం నుంచి తొలిసీజన్ ఛాంపియన్గా రికార్డు నెలకొల్పింది. ధనాధన్ ఆటతో జట్టు విజయంలో కీలకమైన ఫులా సరేన్ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు అందుకుంది.