కోల్కతా: వెస్టిండీస్తో జరుగుతున్న టీ20 సిరీస్లో ఇప్పటికే ఇండియా 2-0 తేడాతో సిరీస్ను కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే శుక్రవారం జరిగిన రెండవ టీ20 మ్యాచ్లో 8 పరుగుల తేడాతో విక్టరీ కొట్టిన టీమిండియా.. మరో ఘనతను కూడా సొంతం చేసుకున్నది. ఇప్పటి వరకు టీ20 మ్యాచుల్లో వంద విజయనాలు నమోదు చేసిన రెండవ జట్టుగా రికార్డును క్రియేట్ చేసింది. మెన్స్ క్రికెట్లో ఎక్కువ టీ20 మ్యాచ్లు గెలిచిన జట్లలో పాకిస్థాన్ మొదటి స్థానంలో ఉన్నది. భారత్ ఇప్పటి వరకు 155 టీ20 మ్యాచ్లు ఆడింది. దాంట్లో 100 మ్యాచ్లను ఇండియా గెలిచింది. 51 మ్యాచుల్లో ఓడగా.. నాలుగింటిలో ఫలితం తేలలేదు. ఇక తొలి స్థానంలో ఉన్న పాకిస్థాన్ ఇప్పటి వరకు 189 టీ20 మ్యాచ్లను ఆడింది. దాంట్లో ఆ జట్టు 118 మ్యాచ్లను గెలిచింది. కానీ గెలుపు శాతంలో పాకిస్థాన్తో పోలిస్తే ఇండియానే బెటర్గా ఉంది.