దుబాయ్: వార్షిక వన్డే మెన్స్ టీమ్ ఐసీసీ ర్యాంకింగ్స్(ICC Rankings)ను ఇవాళ రిలీజ్ చేశారు. వన్డేల్లో భారత జట్టు మూడవ స్థానంలో నిలిచింది. ర్యాంకింగ్స్లో ఆస్ట్రేలియా అగ్రస్థానాన్ని ఆక్రమించింది. ఇక పొరుగు దేశం పాకిస్థాన్ ఆ ర్యాంకుల్లో రెండవ స్థానాన్ని కైవసం చేసుకున్నది. అయిదు సార్లు వన్డేల్లో వరల్డ్ చాంపియన్గా నిలిచిన ఆస్ట్రేలియా.. గత ఏడాది 113 పాయింట్ల నుంచి 118 పాయింట్లకు రేటింగ్ పెంచుకున్నది. దీంతో పాకిస్థాన్పై స్వల్ప లీడింగ్ను సాధించింది. పాక్ 116, ఇండియా 115 పాయింట్లతో వరుసగా రెండో, మూడో స్థానంలో ఉన్నాయి.
Three teams separated by three points 😮
It's neck and neck at the top of the @MRFWorldwide ICC Men's ODI Team Rankings after the annual update 👀
— ICC (@ICC) May 11, 2023