133 పరుగుల మోస్తారు లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా.. మొదటి నుంచి దూకుడుగా ఆడుతోంది. ఓపెనర్లు కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ.. ఇద్దరే మ్యాచ్ను ముందుకు తీసుకెళ్తున్నారు. రోహిత్ శర్మ అయితే చెలరేగిపోతున్నాడు. 24 బంతుల్లో 39 పరుగులు చేసి హాఫ్ సెంచరీకి చేరువలో ఉన్నాడు. అలాగే.. టీ20 ఇంటర్నేషనల్ చరిత్రలో సరికొత్త మైలురాయిని చేరుకున్నాడు. 3000 పరుగులు చేసి కొత్త రికార్డు సృష్టించాడు. ఇప్పటి వరకు 4 ఫోర్లు, రెండు సిక్సులు బాదాడు. కేఎల్ రాహుల్.. 12 బంతుల్లో 15 పరుగులు చేశాడు. ఒక సిక్స్, ఒక ఫోర్ బాదాడు. పవర్ ప్లే ముగిసే సమయానికి అంటే 6 ఓవర్లలో టీమిండియా 54 పరుగులు చేసింది.