ఆదిలోనే ఇండియాకు దెబ్బ తగలడంతో భారత్ స్కోర్ నెమ్మదిస్తోంది. ఏది ఏమైనా.. టీమిండియాను కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆదుకుంటున్నాడు. దీంతో 15 ఓవర్లకు భారత్.. 4 వికెట్ల నష్టానికి 100 పరుగులు చేసింది.
విరాట్ కోహ్లీ 35 బంతుల్లో 37 పరుగులు చేశాడు. జడేజా 8 బంతుల్లో 6 పరుగులు చేశాడు. ఇప్పటికే ఇండియా ఇద్దరు ఓపెనర్లు రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, సూర్య కుమార్ యాదవ్, రిషబ్ పంత్ వికెట్లను కోల్పోయింది.
పాకిస్థాన్ బౌలర్లలో షాహీన్ అఫ్రిది మూడు ఓవర్లు వేసి రెండు వికెట్లు తీశాడు. హసన్ అలీ, షాదబ్ ఖాన్ చెరో వికెట్ తీశారు.