India Open 2024: న్యూఢిల్లీ వేదికగా జరుగుతున్న ఇండియా ఓపెన్ సూపర్ 750 టోర్నమెంట్లో భారత స్టార్ షట్లర్ హెచ్ఎస్ ప్రణయ్.. క్వార్టర్స్కు అర్హత సాధించాడు. గురువారం ముగిసిన పురుషుల సింగిల్స్ రెండో రౌండ్లో ప్రణయ్.. 20-22, 21-14, 21-14 తేడాతో భారత్కే చెందిన ప్రియాన్షు రజావత్ను ఓడించాడు. తొలి సెట్లో ధాటిగా ఆడి పైచేయి సాధించిన రజావత్.. ఆ తర్వాత తేలిపోయాడు. ప్రణయ్ వరుస రెండు సెట్లు గెలిచి క్వార్టర్స్కు దూసుకెళ్లాడు.
ఇక పురుషుల డబుల్స్ రెండో రౌండ్లో భారత స్టార్ షట్లర్ ద్వయం సాత్విక్ సాయిరాజ్ – చిరాగ్ శెట్టిలు 21-14, 21-15 తేడాతో యంగ్ పొ హన్ – లు చింగ్ యావొ (తైవాన్)లపై అలవోక విజయం సాధించారు. రెండు సెట్లలోనూ దూకుడుగా ఆడిన సాత్విక్ – చిరాగ్లు ప్రత్యర్థులకు ఏమాత్రం అవకాశమివ్వకుండా గేమ్ను సొంతం చేసుకుని క్వార్టర్స్కు చేరుకున్నారు.
HSP in quarters🇮🇳😍#YonexSunriseIndiaOpen2024 #IndiaKaSmashMania#BWFWorldTourSuper750#IndiaontheRise#Badminton pic.twitter.com/HEiB2Ghblm
— BAI Media (@BAI_Media) January 18, 2024
Destruction continues 😎
⏭️: Quarterfinal#YonexSunriseIndiaOpen2024 #IndiaKaSmashMania#BWFWorldTourSuper750#IndiaontheRise#Badminton pic.twitter.com/2u2fMUulHs
— BAI Media (@BAI_Media) January 18, 2024
అంతకుముందు పురుషుల సింగిల్స్లో థాయ్లాండ్ స్టార్ ప్లేయర్ కున్లావత్ వితిద్సరన్.. 21-16, 20-22, 21-23 తేడాతో హాంకాంగ్కు చెందిన లీ చెక్ యీ (హాంకాంగ్) చేతిలో ఓడిపోయాడు. మరో మ్యాచ్లో మూడో సీడ్ లి షి ఫెంగ్ (చైనా) 14-21, 21-13, 9-21 తేడాతో అన్సీడెడ్ ప్లేయర్ కోకి వటనబె (జపాన్) చేతిలో ఓడిపోయాడు.