సెంచూరియన్: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో ఇండియా విక్టరీకి చేరువైంది. మరో 3వికెట్లు తీస్తే.. తొలి టెస్టును టీమిండియానే స్వంతం చేసుకుంటుంది. 305 రన్స్ టార్గెట్తో రెండవ ఇన్నింగ్స్ ఆడుతున్న దక్షిణాఫ్రికా 164 రన్స్కు ఏడు వికెట్లు కోల్పోయింది. ఇవాళ ఉదయం ఎల్గర్, డీకాక్, ముల్డర్ వికెట్లను ఇండియన్ బౌలర్లు పడగొట్టేశారు. భారీ స్కోర్ దిశగా వెళ్తున్న ఎల్గర్(77)ను బుమ్రా ఎల్బీడబ్ల్యూ ఔట్ చేశాడు. ఇక డీకాక్ సెటిల్ అవుతున్న సమయంలో అతన్ని సిరాజ్ ఔట్ చేశాడు.