చెన్నై: డబ్ల్యూఎస్ఎఫ్ స్కాష్ ప్రపంచకప్ టోర్నీలో భారత్ శుభారంభం చేసింది. పోటీల తొలి రోజైన మంగళవారం జరిగిన మ్యాచ్లో భారత్ 4-0 తేడాతో హాంకాంగ్పై అద్భుత విజయం సాధించింది.
తొలుత జరిగిన పురుషుల సింగిల్స్లో అభయ్సింగ్ 7-2, 7-3, 7-6తో చుంగ్ యట్పై గెలువగా, జోష్న చినప్ప 7-1, 7-5, 7-6తో హెలీ ఫంగ్ను ఓడించింది.