IND vs ENG 5th Test : ధర్మశాలలో జరుగుతున్న ఐదో టెస్టులో భారత్(Team India) మూడు వికెట్లు కోల్పోయింది. నాలుగు పరుగుల తేడాతో కెప్టెన్ రోహిత్ శర్మ(103: 162 బంతుల్లో 13 ఫోర్లు, 3 సిక్సర్లు), యువకెరటం శుభ్మన్ గిల్(110 :150 బంతుల్లో 10 ఫోర్లు, సిక్సర్లు) లు పెవిలియన్ చేరారు. లంచ్ తర్వాత బౌలింగ్కు దిగిన స్టోక్స్ తొలి బంతికే రోహిత్ను బౌల్డ్ చేశాడు. ఆ తర్వాత అండర్సన్ సూపర్ డెలివరీతో గిల్ను డగౌట్కు చేర్చాడు.
అరంగేట్రం కుర్రాడు దేవ్దత్ పడిక్కల్(17), సర్ఫరాజ్ ఖాన్(6)లు జాగ్రత్తగా ఆడుతున్నారు. ఈ మ్యాచ్లో భారత్ భారీ స్కోర్ చేయాలంటే మిడిలార్డర్ చెలరేగాల్సిందే. ప్రస్తుతానికి టీమిండియా 81 పరుగులు ఆధిక్యంలో ఉంది.
300 up for #TeamIndia! 👍 👍
Follow the match ▶️ https://t.co/jnMticF6fc #INDvENG | @IDFCFIRSTBank pic.twitter.com/UA4yfk0ydM
— BCCI (@BCCI) March 8, 2024
రెండో రోజుల తొలి సెషన్లో సిక్సర్లతో విరుచుకుపడిన హిట్మ్యాన్ టెస్టుల్లో 12వ సెంచరీ నమోదు చేశాడు. ఆ కాసేపటికే బషీర్ బౌలింగ్లో బౌండరీ బాది.. రాంచీ హీరో గిల్ మూడంకెల స్కోర్ సాధించాడు. ఇంగ్లండ్ బౌలర్లకు ఏమాత్రం అవకాశమివ్వని ఈ జోడీ రెండో వికెట్కు 160పరుగులు చేసింది. గిల్, రోహిత్ వీరవిహారంతో లంచ్ సమయానికి భారత్ వికెట్ నష్టానికి 264 రన్స్ కొట్టింది.