పార్ల్: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండవ వన్డేలో ఇండియా వరసగా రెండు కీలక వికెట్లను కోల్పోయింది. సెట్ అయిన బ్యాటర్లు కేఎల్ రాహుల్, రిషబ్ పంత్లు ఔటయ్యారు. కేఎల్ రాహుల్ 55, పంత్ 85 రన్స్ చేసి పెవిలియన్కు చేరుకున్నారు. మూడో వికెట్కు ఇద్దరూ వంద రన్స్ పైగా జోడించారు. అయితే భారీ స్కోర్ చేస్తారనుకున్న ఈ ఇద్దరూ నిరాశపరిచారు. ప్రస్తుతం ఇండియా 35 ఓవర్లలో నాలుగు వికెట్లకు 189 రన్స్ చేసింది. శ్రేయస్, వెంకటేశ్ అయ్యర్లు క్రీజ్లో ఉన్నారు.