కౌలాలంపూర్: ప్రతిష్ఠాత్మక హాకీ జూనియర్ ప్రపంచకప్లో భారత్ సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. మంగళవారం జరిగిన క్వార్టర్స్లో భారత్ 4-3తేడాతో నెదర్లాండ్స్పై ఉత్కంఠ విజయం సాధించింది. మ్యాచ్లో అర్ధభాగం ముగిసేసరికి 0-2తో వెనుకంజలో నిలిచిన యువభారత్ అద్భుతంగా పుంజుకుంది.
మ్యాచ్ మొదలైన ఐదో నిమిషానికే టిమో బోర్స్ గోల్తో నెదర్లాండ్స్ 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. అదే జోరు కొనసాగిస్తూ వాన్డర్ హెజ్డెన్ గోల్ చేయడంతో డచ్ ఆధిక్యం రెట్టింపైంది. అయితే మూడు, నాలుగు క్వార్టర్లో ఆదిత్య(34ని), అరైజీత్సింగ్(36ని) గోల్ చేయడంతో స్కోరు 2-2తో సమమైంది. ఈ తరుణం ఒలీవర్(44ని) గోల్తో డచ్ పోటీలోకి వచ్చింది. మ్యాచ్ మరో పది నిమిషాల్లో ముగుస్తుందనగా సౌరభ్ఆనంద్(52ని), కెప్టెన్ ఉత్తమ్సింగ్(57ని) గోల్స్తో భారత్ చిరస్మరణీయ విజయం సాధించింది. సెమీస్లో జర్మనీతో భారత్ తలపడుతుంది.