న్యూఢిల్లీ: అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్ఐహెచ్) ర్యాంకింగ్స్లో భారత్ నాలుగో ర్యాంక్కు పడిపోయింది. ఆసియాగేమ్స్లో స్వర్ణం ద్వారా ఇప్పటికే పారిస్ ఒలింపిక్స్ బెర్తు దక్కించుకున్న టీమ్ఇండియా ప్రస్తుతం 2760 పాయింట్లతో నాలుగో ర్యాంక్లో నిలిచింది.
ఎఫ్ఐహెచ్ టోర్నీల్లో మెరుగైన ప్రదర్శనతో జర్మనీ (2785) మూడో ర్యాంక్కు చేరుకుంది. నెదర్లాండ్స్ (3060), బెల్జియం (2848) తొలి రెండు ర్యాంక్ల్లో ఉన్నాయి