ఐర్లాండ్ తో జరుగుతున్నా మ్యాచ్ లో భారత బ్యాటర్లు రాణించారు. వర్షం వల్ల 12 ఓవర్లకు కుదించిన మ్యాచ్ లో ఐర్లాండ్ ముందుగా బ్యాటింగ్ చేసింది. హ్యారీ టెక్టర్ (64 నాటవుట్) ధాటిగా ఆడటం తో ఆ జట్టు 108/4 స్కోర్ చేసింది. ఛేజింగ్ లో భారత్ కు ఇషాన్ కిషన్ (26), దీపక్ హుడా (47 నాటవుట్) అద్భుతమైన ఆరంభం అందించారు.
కిషన్ అవుటైన తర్వాత వచ్చిన సూర్యకుమార్ యాదవ్ (0) డకౌట్ అయ్యాడు. ఇలాంటి సమయంలో క్రీజులోకి వచ్చిన హార్దిక్ పాండ్య (24) ధాటిగా ఆడాడు. కానీ లిటిల్ బౌలింగ్ లో అవుటయ్యాడు. ఆ తర్వాత వచ్చిన దినేష్ కార్తీక్ (5 నాటౌట్) తో కలిసి హుడా.. భారత జట్టును విజయతీరాలకు చేర్చాడు. బ్యాటర్లు రాణించడంతో భారతజట్టు మరో 16 బంతులు మిగులుండగానే 111 పరుగులు చేసి విజయం సాధించింది. ఐర్లాండ్ బౌలర్లలో క్రెయిగ్ యంగ్ రెండు వికెట్లు తీయగా.. జోష్ లిటిల్ ఒక వికెట్ తీసుకున్నాడు.