న్యూఢిల్లీ : ఉజ్బెకిస్థాన్ రాజధాని తాష్కెంట్లో జరుగుతున్న ఆసియన్ యూత్ అథ్లెటిక్స్ టోర్నీలో భారత్కు గురువారం మొదటి రోజు ఒక స్వర్ణం సహా నాలుగు పతకాలు దక్కాయి.
1500మీ. పరుగులో భారత్కు చెందిన రాహుల్, ప్రియాంషు తొలి రెండు స్థానాల్లో నిలిచి స్వర్ణ, రజత పతకాలు దక్కించుకున్నారు. ఆరతి, ముబాసిన కాంస్యాలు గెలుచుకున్నారు.