IND vs WI : భారత్ – వెస్టిండీస్ మూడు వన్డేల సిరీస్(ODI Series)కు తెరలేచింది. ఈరోజు బార్బడాస్లోని కెన్షింగ్టన్ ఓవల్(Kensington Oval)లో తొలి వన్డే జరుగుతోంది. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన వెస్టిండీస్కు ఆదిలోనే షాక్ తగిలింది. మ్యాచ్ ప్రారంభమైన కాసేటికే హార్దిక్ పాండ్యా(Hardhik Pandya) తొలి వికెట్ తీశాడు. తన రెండో ఓవర్లోనే డేంజరస్ ఓపెనర్ కైల్ మేయర్స్(2)ను ఔట్ చేశాడు. దాంతో, ఏడు పరుగుల వద్దే విండీస్ తొలి వికెట్ కోల్పోయింది. బ్రాండన్ కింగ్(6), అలిక్ అథనజే(1) క్రీజులో ఉన్నారు. 4 ఓవర్లకు స్కోర్.. 9/1.
టాస్ గెలిచిన రోహిత్ శర్మ ఫీల్డింగ్ తీసుకున్నాడు. టెస్టు సిరీస్ గెలిచిన టీమిండియా వన్డేల్లోనూ జోరు కొనసాగించాలని అనుకుంంటోది. మరోవైపు పరువు కాపాడుకోవాలని విండీస్ పట్టుదలతో ఉంది. దాంతో, ఈ పోటీలో ఎవరు గెలుస్తారనే ఉత్కంఠ నెలకొంది.
భారత్: రోహిత్శర్మ(కెప్టెన్), శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్, ఇషాకిషన్, రవీంద్ర జడేజా, శార్దుల్ ఠాకూర్, కుల్దీప్యాదవ్, సిరాజ్, ఉమ్రాన్ మాలిక్, ముకేశ్ కుమార్.
వెస్టిండీస్: షాయి హోప్(కెప్టెన్), కింగ్, కైలీ మేయర్స్, కార్టీ, హెట్మైర్, పావెల్, షెఫర్డ్, సింక్లేయిర్, జోసెఫ్, గుడంకేశ్ మోతీ, జైడేన్ సీల్స్, డొమినిక్ డ్రేక్స్,