మిర్పూర్: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ .. బంగ్లాదేశ్తో జరిగే టెస్టు సిరీస్కు అందుబాటులో ఉండే అవకాశాలు ఉన్నాయి. బంగ్లాతో జరిగిన రెండో వన్డేలో రోహిత్ వేలికి గాయమైన విషయం తెలిసిందే. దీంతో అతన్ని మూడవ వన్డేకు దూరం పెట్టారు. డిసెంబర్ 14వ తేదీన బంగ్లాతో తొలి టెస్టు ప్రారంభంకానున్న నేపథ్యంలో బీసీసీఐ శుక్రవారం ఓ ప్రకటన చేసింది. గాయపడ్డ రోహిత్కు బీసీసీఐ మెడికల్ బృందం పరీక్షలు చేస్తోందని, స్పెషలిస్టు కన్సల్టేషన్ కోసం అతను ముంబైకి వెళ్లాడని, మూడవ వన్డే రోహిత్ మిస్సవుతాడని, ఇక టెస్టు సిరీస్కు అతను అందుబాటులో ఉంటాడో లేదో అన్న విషయాన్ని తర్వాత వెల్లడించనున్నట్లు బీసీసీఐ ఒక ప్రకటనలో తెలిపింది. బంగ్లాతో జరిగే మూడవ వన్డేలో భారత జట్టులోకి కుల్దీప్ యాదవ్ను ఎంపిక చేసినట్లు బీసీసీఐ చెప్పింది.