డెన్మార్క్ ఓపెన్లో భారత బృందం యాత్ర ముగిసింది. కామన్వెల్త్ గేమ్స్లో స్వర్ణ పతకం సాధించిన షట్లర్ లక్ష్య సేన్.. శుక్రవరాం జరిగిన మ్యాచ్లో ఓటమితో టోర్నీ నుంచి తప్పుకున్నాడు. జపాన్కు చెందిన కొడాయ్ నరవోకాతో క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లో తలపడిన లక్ష్యసేన్.. 17-21, 12-21 తేడాతో వరుస సెట్లలో ఓటమి పాలయ్యాడు.
ఓడెన్స్ వేదికగా జరుగుతున్న ఈ టోర్నీలో లక్ష్యసేన్ ఒక్కడే భారత్ తరఫున పోరాడిన చివరి క్రీడాకారుడు. ఇవాళే పురుషుల డబుల్స్ విభాగంలో సాత్విక్సాయిరాజ్ రాంకీరెడ్డి, చిరాగ్ శెట్టి కూడా క్వార్టర్ ఫైనల్లో ఓటమి పాలయ్యారు. దీంతో ఈ టోర్నీలో భారత బృందం క్యాంపెయిన్ ముగిసింది.