దుబాయ్: అద్వితీయ ప్రదర్శనతో అదరగొట్టిన యువ భారత జట్టు.. ఎనిమిదోసారి అండర్-19 ఆసియా కప్ ట్రోఫీ చేజిక్కించుకుంది. నిలకడైన ఆటతీరుతో ప్రత్యర్థులను చిత్తు చేసుకుంటూ ఫైనల్ చేరిన యువ భారత్.. శుక్రవారం భారీ వర్షం కారణంగా డక్వర్త్ లూయిస్ పద్ధతిలో జరిగిన తుది పోరులో 9 వికెట్ల తేడాతో లంకపై ఘన విజయం సాధించింది. తొలుత లంక 38 ఓవర్లలో 9 వికెట్లకు 106 పరుగులు చేసింది. భారత బౌలర్లలో విక్కీ 3, కౌషల్ రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యాన్ని 32 ఓవర్లలో 102గా నిర్ణయించగా.. రఘువంశి (56 నాటౌట్), రషీద్ (31 నాటౌట్) రాణించడంతో యువ భారత జట్టు 21.3 ఓవర్లలో వికెట్ నష్టానికి 104 పరుగులు చేసి గెలిచింది.