హాంగ్జూ: చైనాలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో.. ఇండియన్ క్రికెట్ జట్టు సెమీఫైనల్లోకి ఎంటరైంది. ఇవాళ జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లో ఇండియా 23 రన్స్ తేడాతో నేపాల్ జట్టుపై గెలుపొందింది. భారత జట్టు తొలుత బ్యాటింగ్ చేసి నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 202 రన్స్ చేసింది. టాప్ ఫామ్లో ఉన్న ఓపెనర్ యశస్వి జైస్వాల్(Yashasvi Jaiswal) సెంచరీ కొట్టాడు. 49 బంతుల్లో అతను ఏడు సిక్స్లు, 8 ఫోర్లతో 100 రన్స్ చేసి ఔటయ్యాడు. రుతురాజ్ గైక్వాడ్(25)తో కలిసి జైస్వాల్ తొలి వికెట్కు 103 రన్స్ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. అయిదో వికెట్కు శివం దూబే, రింకూ సింగ్లు అజేయంగా 52 రన్స్ జోడించారు. రింకూ సింగ్ తన పవర్ గేమ్తో ఆకట్టుకున్నాడు. రింకూ సింగ్ 15 బంతుల్లో నాలుగు ఫోర్లు, రెండు సిక్సర్లతో 37 రన్స్ చేసి నాటౌట్గా నిలిచాడు. ఆ తర్వాత భారీ టార్గెట్తో బరిలోకి దిగిన నేపాల్ జట్టు.. 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 179 రన్స్ చేసింది. భారత బౌలర్లు రవి బిష్ణోయ్, అవేశ్ ఖాన్లు చెరి మూడు వికెట్లు తీసుకున్నారు.
Yashasvi Jaiswal’s Maiden T20I 💯 powers India to a 23-run win against Nepal 👏#TeamIndia are through to the semifinals of the #AsianGames 🙌
Scorecard ▶️ https://t.co/wm8Qeomdp8#IndiaAtAG22 pic.twitter.com/3fOGU6eFXi
— BCCI (@BCCI) October 3, 2023