U-19 World Cup | కెప్టెన్ ఉదయ్, సచిన్ సెంచరీలతో విజృంభించడంతో యువభారత జట్టు అండర్-19 ప్రపంచకప్ సెమీఫైనల్లో అడుగుపెట్టింది. నేపాల్తో సూపర్ సిక్స్ పోరులో దుమ్మురేపిన యంగ్ ఇండియా ఇదే జోరులో మరో రెండు మ్యాచ్లు గెలిస్తే ఆరోసారి జగజ్జేతగా నిలువనుంది!
బ్లూమ్ఫాంటైన్: అండర్-19 ప్రపంచకప్లో యువభారత్ జోరు కొనసాగుతున్నది. డిఫెండింగ్ చాంపియన్గా బరిలోకి దిగిన యంగ్ఇండియా వరుస విజయాలతో సెమీస్కు దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన సూపర్ సిక్స్ గ్రూప్-1 పోరులో యువభారత్ 132 పరుగుల తేడాతో నేపాల్పై విజయం సాధించింది.
కెప్టెన్ ఉదయ్ (100), సచిన్ దాస్ (116) సెంచరీలతో కదంతొక్కడంతో తొలుత బ్యాటింగ్ చేసిన యంగ్ఇండియా నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 297 పరుగులు చేసింది. వీరిద్దరూ నాలుగో వికెట్కు 215 పరుగులు చేశారు. యంగ్ఇండియాకు ఇదే అత్యధిక భాగస్వామ్యం. నేపాల్ బౌలర్లలో గుల్షాన్ మూడు వికెట్లు తీశాడు. అనంతరం భారీ లక్ష్యఛేదనలో నేపాల్ 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 165 పరుగులు చేసింది. దేవ్ ఖనల్ (33) టాప్ స్కోరర్.