న్యూఢిల్లీ: జూనియర్ ఆసియా కప్లో భారత మహిళల హాకీ జట్టు సెమీఫైనల్కు దూసుకెళ్లింది. పూల్-‘ఎ’లో భాగంగా గురువారం జరిగిన పోరులో భారత అమ్మాయిలు 11-0తో చైనీస్ తైపీని చిత్తుచేశారు. అన్ను (10వ, 52వ నిమిషాల్లో), సునేలితా (43వ, 57వ ని.ల్లో) డబుల్ గోల్స్తో ఆకట్టుకోగా..
వైష్ణవి (1వ ని.లో), దీపిక (3వ ని.లో), రుతూజ (12వ ని.లో), నీలమ్ (19వ ని.లో), మంజు (33వ ని.లో), దీపిక (46వ ని.లో), ముంతాజ్ (55వ ని.లో) ఒక్కో గోల్ చేశారు. మ్యాచ్ ఆరంభం నుంచి సంపూర్ణ ఆధిపత్యం కనబర్చిన మన అమ్మాయిలు.. ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా చెలరేగిపోయారు.