హామిల్టన్: ఐసీసీ వుమెన్స్ వరల్డ్కప్లో బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్లో ఇవాళ ఇండియన్ మహిళల జట్టు 110 రన్స్ తేడాతో నెగ్గింది. 230 రన్స్ టార్గెట్తో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ కేవలం 119 రన్స్కే ఆలౌట్ అయ్యింది. రాజేశ్వరి గైక్వాడ్ 10 ఓవర్లలో 15 రన్స్ ఇచ్చి నాలుగు వికెట్లు తీసుకున్నారు. అంతకముందు ఇండియా తొలుత బ్యాటింగ్ చేసిన 229 రన్స్ చేసింది. భాటియా హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నది. బంగ్లాపై గెలిచిన మిథాలీ సేన సెమీస్పై ఆశలు నిలుపుకున్నది. ఒకవేళ సౌతాఫ్రికాతో మ్యాచ్లో నెగ్గితే అప్పుడు ఇండియా సెమీస్ అవకాశాలు ఈజీ అవుతాయి.
స్కోరు బోర్డు
ఇండియా 229-7
(స్మృతి 30, భాటియా 50, షఫాలీ 42)
బంగ్లాదేశ్ 119 ఆలౌట్
A magnificent win for #TeamIndia 🙌
They beat Bangladesh by 110 runs to keep their semi-finals qualification hopes alive. #CWC22 pic.twitter.com/ix3xmjE41q
— ICC (@ICC) March 22, 2022