ఇంగ్లండ్తో పరిమిత ఓవర్ల సిరీస్ల కోసం బీసీసీఐ శుక్రవారం జట్లను ఎంపిక చేసింది. కరోనా వైరస్ నుంచి కోలుకుంటున్న రెగ్యులర్ కెప్టెన్ రోహిత్శర్మ.. ఇంగ్లండ్తో టీ20 మ్యాచ్కు అందుబాటులోఉండనున్నాడు.
ప్రస్తుతం ఇంగ్లండ్తో ఐదో టెస్టు ఆడుతున్న కోహ్లీ, పంత్, బుమ్రా, అయ్యర్…9న జరిగే రెండో టీ20కి జట్టుతో కలవనున్నారు. షమీకి టీ20 జట్టులో చోటు దక్కలేదు. శిఖర్ ధవన్ను వన్డేలకు ఎంపిక చేసిన సెలెక్టర్లు యువ పేసర్ ఆర్ష్దీప్ సింగ్కు అవకాశమిచ్చారు.