లండన్: వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్(డబ్ల్యూటీసీ)లో భాగంగా జరుగుతున్న ఇండియా, ఇంగ్లండ్ ( India vs England ) సిరీస్ తొలి టెస్ట్ వర్షం కారణంగా డ్రా అయిన విషయం తెలుసు కదా. ఈ టెస్ట్ ఫలితాన్ని ఇవ్వకపోయినా.. రెండు టీమ్స్కూ డబ్ల్యూటీసీ పాయింట్లలో కోతకు, జరిమానాకు కారణమైంది. స్లో ఓవర్ రేట్ కారణంగా రెండు జట్లకూ ఐసీసీ రెండేసి డబ్ల్యూటీసీ పాయింట్లు కోత పెట్టడంతోపాటు 40 శాతం జరిమానా విధించింది. డబ్ల్యూటీసీ కొత్త పాయింట్ల వ్యవస్థ ప్రకారం.. ఒక టెస్ట్ డ్రా అయితే రెండు టీమ్స్కు నాలుగేసి పాయింట్ల కేటాయిస్తారు. కానీ ఇండియా, ఇంగ్లండ్ ఖాతాలో ప్రస్తుతం రెండేసి పాయింట్లు మాత్రమే ఉన్నాయి.