అమ్స్టెల్వీన్ (నెదర్లాండ్స్): మహిళల హాకీ ప్రపంచకప్లో భాగంగా ఆదివారం ఇంగ్లండ్తో జరిగిన తొలి పోరును భారత్ 1-1తో ‘డ్రా’ చేసుకుంది. ఇంగ్లండ్ తరఫున 9వ నిమిషంలో ఇసాబెల్లా గోల్ నమోదు చేయగా.. రెండో క్వార్టర్లో భారత్ స్కోరు సమం చేసింది. మన జట్టు తరఫున వందనా కటారియా (28వ ని.లో) ఏకైక గోల్ సాధించింది. అనంతరం ఇరు జట్లు ఎంత ప్రయత్నించినా మరో గోల్ చేయలేకపోవడంతో చివరకు మ్యాచ్ ‘డ్రా’గా ముగిసింది. పూల్-‘బి’లో భాగంగా తదుపరి మ్యాచ్లో మంగళవారం చైనాతో తలపడనుంది.