న్యూఢిల్లీ: ప్రతిష్ఠాత్మక వన్డే ప్రపంచకప్లో పెద్దగా ప్రాధాన్యత లేని మ్యాచ్లకు ఆతిథ్యమిచ్చే అవకాశం దక్కించుకున్న హైదరాబాద్కు.. ఈ సీజన్లో బీసీసీఐ మరో రెండు మ్యాచ్లు కేటాయించింది. వరల్డ్కప్ ఫస్ట్ మ్యాచ్, లాస్ట్ మ్యాచ్తో పాటు భారత్-పాకిస్థాన్ పోరు వంటి కీలక మ్యాచ్లను తన సొంత రాష్ట్రంలోని అహ్మదాబాద్ స్టేడియానికి కేటాయించిన బీసీసీఐ కార్యదర్శి జై షా.. కంటితుడుపు చర్యల్లో భాగంగా ఈసారి ఇతర మైదానాలకు మ్యాచ్లు నిర్వహించే అవకాశం కల్పించాడు. దీంతో ఈ ఏడాది చివర్లో భారత్, ఆస్ట్రేలియా మధ్య జరుగనున్న ఐదో టీ20 మ్యాచ్ (డిసెంబర్ 3న)కు ఉప్పల్ స్టేడియం ఆతిథ్యమివ్వనుంది. అనంతరం ఇంగ్లండ్ జట్టు ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్ కోసం భారత్ రానుండగా.. దీనికి సంబంధించిన షెడ్యూల్ను కూడా బీసీసీఐ మంగళవారమే ప్రకటించింది. ఇందులో భాగంగా 2024 జనవరి 25 నుంచి 29 వరకు హైదరాబాద్ వేదికగా భారత్, ఇంగ్లండ్ తొలి టెస్టు జరుగనుంది.