హైదరాబాద్: మహిళల ప్రపంచకప్లో (Women’s World Cup) భాగంగా పాకిస్థాన్తో జరుగుతున్న మ్యాచ్లో భారత్ విజయానికి చేరువయింది. భారత్ విధించిన 244 పరుగుల లక్ష్య ఛేదనలో పాక్ బ్యాటర్లు తడబడ్డారు. క్రమం తప్పకుండా వికెట్లు తీస్తున్న టీమిండియా బౌలర్లు పాక్ స్వల్ప పరుగులకు పాక్ టాపార్డర్ను కుప్పకూల్చారు. 41 ఓవర్లు ముగిసే సరికి 9 వికెట్లు కోల్పోయిన పాక్ 114 పరుగులు మాత్రమే చేసింది. ఆ జట్టులో 30 పరుగులు చేసిన సిద్రా అమీన్ టాప్స్కోరర్గా ఉన్నది. భారత బౌలర్లు రాజేశ్వరి నాలుగు వికెట్లు తీయగా, జులన్ గోస్వామి రెండు, స్నేహా, దీప్తి చెరో వికెట్ పడగొట్టారు.