భారత్తో జరిగిన మూడో వన్డేలో జింబాబ్వే గెలిచినంత పని చేసింది. 290 పరుగుల భారీ లక్ష్యంతో బరిలో దిగిన ఆ జట్టుకు ఓపెనర్లు ఇన్నొసెంట్ కాయా (6), కైటానో (13) శుభారంభం అందించలేదు. అయితే షాన్ విలియమ్స్ (45) మరోసారి కీలక ఇన్నింగ్స్ ఆడాడు. కానీ మిగతా బ్యాటర్లు మున్యోంగా (15), చకాబ్వా (16), ర్యాన్ బర్ల్ (8), ల్యూక్ జాంగ్వే (14) ఎవరూ రాణించలేదు.
అయినా సరే పట్టువదలకుండా పోరాడిన సికందర్ రజా (115) ఆ జట్టును గెలిపించినంత పని చేశాడు. అతనికి బ్రాడ్ ఇవాన్స్ (28) మంచి సహకారం అందించాడు. కానీ శుభ్మన్ గిల్ అద్భుతమైన క్యాచ్తో రజాను అవుట్ చేయడంతో జింబాబ్వే ఆశలు ఆవిరయ్యాయి. ఈ క్రమంలో జింబాబ్వే జట్టు 49.3 ఓవర్లలో 276 పరుగులకు ఆలౌట్ అయింది.
దీంతో భారత జట్టు 13 పరుగుల తేడాతో మూడో వన్డేలో కూడా విజయం సాధించింది. భారత బౌలర్లలో ఆవేష్ ఖాన్ మూడు వికెట్లు తీసుకోగా.. చాహర్, కుల్దీప్, అక్షర్ తలో రెండు వికెట్లు తమ ఖాతాలో వేసుకున్నారు. శార్దూల్ ఠాకూర్ ఒక వికెట్ కూల్చాడు. ఈ విజయంతో సిరీస్ను 3-0తో భారత్ ఖాతాలో చేరింది.