వెస్టిండీస్తో వన్డే సిరీస్ ముందు భారత జట్టుకు భారీ షాక్ తగిలింది. ఓపెనర్లు శిఖర్ ధావన్, రుతురాజ్ గైక్వాడ్, శ్రేయాస్ అయ్యర్తోపాటు పలువురు క్రికెటర్లు, సహాయక సిబ్బందికి కరోనా సోకింది. దీంతో వీరంతా ఐసొలేషన్లో ఉన్నారు. ఈ క్రమంలో వెస్టిండీస్తో జరిగే వన్డే సిరీస్లో వీళ్లు ఆడటం కష్టమే.
ఎందుకంటే నిబంధనల ప్రకారం కరోనా సోకిన వాళ్లు రెండుసార్లు ఆర్టీ పీసీఆర్ టెస్టుల్లో నెగెటివ్ రిపోర్టును తీసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాతే జట్టుతో కలుస్తారు. అలాగే సఫారీ గడ్డ నుంచి ఆలస్యంగా భారత్ చేరిన మయాంక్ అగర్వాల్ ఇంకా క్వారంటైన్లోనే ఉన్నాడు. అదే సమయంలో వ్యక్తిగత కారణాలతో కేఎల్ రాహుల్.. వన్డే సిరీస్ ఓపెనింగ్ మ్యాచ్కు దూరమయ్యాడు.
ఈ క్రమంలో భారత జట్టుకు ఇషాన్ కిషన్ తప్ప మరో ఓపెనర్ లేడని కెప్టెన్ రోహిత్ శర్మ కూడా స్పష్టం చేశాడు. ఈ నేపథ్యంలో తాజాగా బీసీసీఐ అధికారికంగా ప్రకటన చేసింది. ఇషాన్ కిషన్తోపాటు తమిళనాడు హార్డ్ హిట్టర్ షారుఖ్ ఖాన్కు తొలి వన్డే ఆడే జట్టులో చోటు కల్పించింది. ఈ మేరకు భారత బృందంలో మార్పులు చేస్తూ ప్రకటన విడుదల చేసింది.
సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ ఫైనల్లో చివరి బంతికి సిక్సర్ కొట్టిన షారుఖ్ ఖాన్.. తమిళనాడు జట్టును గెలిపించిన సంగతి తెలిసిందే. అంతకు ముందు కూడా అతను హార్డ్ హిట్టర్గా మంచి పేరు సంపాదించుకున్నాడు.
భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, రిషభ్ పంత్, దీపక్ చాహర్, శార్దూల్ ఠాకూర్, యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయి, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, ఆవేష్ ఖాన్, ఇషాన్ కిషన్, షారుఖ్ ఖాన్.
NEWS – Ishan Kishan and Shahrukh Khan added to squad for 1st ODI.
More details here – https://t.co/lJRVufPI3s #INDvWI pic.twitter.com/I5jqVp3BQf
— BCCI (@BCCI) February 5, 2022