విండీస్తో జరుగుతున్న తొలి వన్డేలో భారత బౌలర్లు అదరగొడుతున్నారు. అహ్మదాబాద్లోని నరేంద్రమోదీ స్టేడియలో జరుగుతున్న ఈ మ్యాచ్లో హైదరాబాదీ పేసర్ మహమ్మద్ సిరాజ్ ఆరంభంలోనే విండీస్ను దెబ్బతీశాడు. షాయి హోప్ (8)ను పెవిలియన్ చేర్చాడు. ఆ తర్వాత వాషింగ్టన్ సుందర్ ఒకే ఓవర్లో బ్రాండన్ కింగ్ (13), డారెన్ బ్రావో (18)ను అవుట్ చేశాడు.
ఇప్పుడు 20వ ఓవర్లో తొలిసారి బంతి అందుకున్న యుజ్వేంద్ర చాహల్ కూడా తన ఓవర్లో రెండు వికెట్లు తీసి భారత్ను ఆధిపత్యంలో నిలిపాడు. ఈ ఓవర్ మూడో బంతికి మరో నికోలస్ పూరన్ (18)ను ఎల్బీగా అవుట్ చేశాడు. అంపైర్ అవుట్ ఇవ్వకపోవడంతో రోహిత్ వెంటనే రివ్యూ కోరాడు. బంతికి బ్యాటు తగిలిందేమో అని అంపైర్ అనుమానించినట్లు కనిపించింది.
అయితే రివ్యూలో బ్యాటు తగల్లేదని తేలింది. దీంతో పూరన్ పెవిలియన్ చేరాడు. ఆ మరుసటి బంతికే విండీస్ కెప్టెన్ కీరన్ పొలార్డ్ (0)ను బౌల్డ్ చేశాడు. చాహల్ వేసిన గూగ్లీని అంచనా వేయలేకపోయిన పొలార్డ్ బౌల్డ్ అయ్యాడు. దీంతో 20 ఓవర్లు ముగిసే సరికి విండీస్ జట్టు 71/5 స్కోరుతో నిలిచింది. క్రీజులో జేసన్ హోల్డర్, షామార్ బ్రూక్స్ ఉన్నారు.