IND vs SL | శ్రీలంకతో జరుగుతున్న మూడో టీ20లో టీమిండియా ఘనవిజయం సాధించింది. నిర్ణయాత్మక మ్యాచ్లో 91 పరుగుల తేడాతో గెలుపొందింది. 2-1 తేడాతో సిరీస్ను సొంతం చేసుకుంది. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా ఆరంభం నుంచే అదరగొట్టింది. వైస్ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ చెలరేగి ఆడాడు.
ఓపెనర్ శుభ్మన్ గిల్ (48)తో కలిసి స్కోర్బోర్డును పరుగులు పెట్టించాడు. 45 బంతుల్లోనే సెంచరీ చేశాడు. టీ20ల్లో వేగంగా సెంచరీ చేసిన రెండో టీమిండియా ఆటగాడిగా నిలిచాడు. చివరలో అక్షర్ పటేల్ (21) విధ్వంసం సృష్టించాడు. రాహుల్ త్రిపాఠి 35 రన్స్తో రాణించారు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లు ముగిసేసరికి 228 పరుగుల భారీ స్కోర్ను చేశారు.
229 పరుగుల లక్ష్య చేధనకు దిగిన శ్రీలంక 137 పరుగులకే ఆలౌటైంది.