భారత్తో జరుగుతున్న టీ20 మ్యాచ్లో శ్రీలంక జట్టుకు శుభారంభం లభించింది. 173 పరుగుల టార్గెట్తో బరిలో దిగిన ఆ జట్టుకు ఓపెనర్లు కుశాల్ మెండిస్ (24 నాటౌట్), పాథుమ్ నిస్పంక (33 నాటౌట్) అదిరిపోయే ఆరంభం అందించారు. దీంతో ఆ జట్టు పవర్ప్లే ముగిసే సరికి వికెట్లేమీ కోల్పోకుండా 57 పరుగులు చేసింది.
భారత బౌలర్లలో అర్సదీప్ సింగ్ రెండు ఓవర్లు వేసి 26 పరుగులివ్వగా.. భువనేశ్వర్ కూడా రెండు ఓవర్లు వేసినప్పటికీ కేవలం 9 పరుగులే ఇచ్చాడు. మిడిల్ ఓవర్లలో లంకేయులను కట్టడి చెయ్యలేకపోతే భారత జట్టుకు తర్వాత కష్టాలు తప్పవు.