ఒక పక్క ఆటగాళ్లందరూ ఒకరి తర్వాత మరొకరు వరుసపెట్టి పెవిలియన్ చేరుతున్నారు. రెండంకెల స్కోరు చేయడానికి కూడా నానా తంటాలు పడుతున్నారు. ప్రత్యర్థులది కూడా అదే పరిస్థితి. అలాంటి పిచ్పై పట్టుదలతో భారత బౌలర్లకు ఎదురొడ్డిన శ్రీలంక సారధి దిముత్ కరుణరత్నే (107 నాటౌట్) సెంచరీతో ఆకట్టుకున్నాడు.
447 పరుగుల అసాధ్యమైన లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన లంకకు ఆరంభంలోనే ఎదురు దెబ్బ తగిలింది. బుమ్రా బౌలింగ్లో లాహిరు తిరిమానే (0) డకౌట్గా వెనుతిరిగాడు. ఆ తర్వాత కుశాల్ మెండిస్ (54)తో కలిసి 97 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన కరుణరత్నే జట్టును ఆదుకునే ప్రయత్నం చేశాడు.
కానీ మెండిస్ అవుటైన తర్వాత మాథ్యూస్ (1), డిసిల్వ (4), డిక్కవెల్ల (12), ఆసలంక (5) ఎవరూ కెప్టెన్కు సహకారం అందించలేకపోయారు. అయినా సరే సహనం కోల్పోకుండా అనవసర షాట్లకు వెళ్లకుండా ఆడిన కరుణరత్నే ఇన్నింగ్స్.. ఈ మ్యాచ్కే హైలైట్గా చెప్పవచ్చు. స్టేడియంలోని ప్రేక్షకులు కూడా అతనికి స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చి అభినందించారు.