IND vs SL : టీమిండియా నిర్ధేశించిన 373 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో శ్రీలంక వెంట వెంటనే రెండు వికెట్లు కోల్పోయింది. సిరాజ్ బౌలింగ్లో కుశాల్ మెండిస్ బౌల్డ్ అయ్యాడు. అంతకు ముందు ఓవర్లో ఓపెనర్ ఆవిష్క ఫెర్నాండోను సిరాజ్ అవుట్ చేశాడు. నాలుగో ఓవర్ ఐదో బంతికి ఫెర్నాండో భారీ షాట్కు ప్రయత్నించాడు. హార్దిక్ పాండ్యా ఆ క్యాచ్ను ఒడిసి పట్టుకోవడంతో భారత్కు మొదటి వికెట్ లభించింది. ప్రస్తుతం 7 ఓవర్లకు రెండు వికెట్ల నష్టానికి 32 పరుగులు చేసింది. నిస్సంకా 18, చరిత అసలంక 4పరుగులతో క్రీజులో ఉన్నారు.
టాస్ ఓడిపోయి బ్యాటింగ్కు దిగిన భారత్కు ఓపెనర్లు రోహిత్ (83), శుభ్మన్ గిల్ (70) శుభారంభం ఇచ్చారు. మిడిలార్డర్లో కోహ్లీ లంక బౌలర్లపై విరుచుకుపడ్డాడు. 80 బంతుల్లోనే సెంచరీ కొట్టాడు. దాంతో, భారత్ 373 రన్స్ చేసింది.
తొలి వన్డేలో క్లాస్ ఇన్నింగ్స్తో శతకం బాదిన విరాట్ కోహ్లీ ప్రపంచ రికార్డులు బద్ధలు కొట్టాడు. వన్డేల్లో 45వ, అంతర్జాతీయ క్రికెట్లో 73వ శతకం సాధించిన అతను టీమిండియా దిగ్గజం సచిన్ టెండూల్కర్ రికార్డును సమం చేశాడు. స్వదేశంలో 20 సెంచరీలు చేసిన రెండో బ్యాటర్గా గుర్తింపు సాధించాడు. స్వదేశంలో తక్కువ ఇన్నింగ్స్ల్లో 20 సెంచరీలు కొట్టిన బ్యాటర్గా రికార్డు క్రియేట్ చేశాడు. 99 ఇన్నింగ్స్ల్లోనే కోహ్లీ ఈ మైలురాయిని అందుకున్నాడు. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ 20 సెంచరీలకు… ReaMore>>
ఇండియన్ క్రికెట్ కెప్టెన్ రోహిత్ శర్మ మళ్లీ మైదానంలోకి దిగాడు. శ్రీలంకతో ఇవాళ ప్రారంభంకానున్న వన్డే సిరీస్లో అతను ఆడనున్నాడు. అయితే గౌహతిలో సోమవారం ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో ఓ ఘటన జరిగింది. నెట్ ప్రాక్టీస్ తర్వాత రోహిత్ తన అభిమానుల్ని కలిశాడు. తన అభిమాన రోహిత్ను చూసిన ఓ కుర్రాడు కన్నీరు పెట్టుకున్నాడు. ఆ సమయంలో ఆ బాలుడి దగ్గరకు వెళ్లి అతన్ని.. Read More>>