IND vs SL : రెండో వన్డేలో టాస్ గెలిచిన శ్రీలంక బ్యాటింగ్ తీసుకుంది. ఈ మ్యాచ్లో గెలిచి సిరీస్లో నిలవాలనే పట్టుదలతో ఉన్న ఆ జట్టను పేసర్ మహమ్మద్ సిరాజ్ ఆదిలోనే దెబ్బతీశాడు. ఓపెనర్ ఆవిష్క ఫెర్నాండో(20)ను వెనక్కి పంపాడు. టచ్లో ఉన్న అతడిని ఆరో ఓవర్ చివరి బంతికి బౌల్డ్ చేశాడు. 13 ఓవర్లు పూర్తయ్యేసరికి శ్రీలంక ఒక వికెట్ నష్టానికి 78 రన్స్ చేసింది. ప్రస్తుతం కుశాల్ మెండిస్ 20, నువింద్ ఫెర్నాండో32 పరుగులతో క్రీజులో ఉన్నారు. వీళ్లిద్దరూ మరో వికెట్ పడకుండా ఆచితూచి ఆడుతున్నారు.