IND vs SL : భారత్ కేఎల్ రాహుల్ వికెట్ కోల్పోయింది. 39 రన్స్ చేసిన రాహుల్ కసున్ రజిత బౌలింగ్లో బౌల్డ్ అయ్యాడు. రజిత వేసిన బంతి లెగ్ స్టంప్కు తాకింది. 4 ఫోర్లు, ఒక సిక్సర్తో ఫామ్లో ఉన్నట్టు కనిపించిన రాహుల్ బంతిని సరిగా అంచనా వేయలేక వికెట్ సమర్పించుకున్నాడు. రాహుల్తో కలిసి కోహ్లీ స్కోర్ బోర్డును మూడొందలు దాటించాడు. వీళ్లిద్దరూ బౌండరీలు, సిక్సర్లు బాదుతూ లంక బౌలర్లపై విరుచుకుపడ్డారు. 44 ఓవర్లకు టీమిండియా నాలుగు వికెట్లు కోల్పోయి 326రన్స్ చేసింది. ప్రస్తుతం కోహ్లీ 90, హార్దిక్ పాండ్యా 14 పరుగులతో క్రీజులో ఉన్నారు.
టాస్ ఓడిపోయి బ్యాటింగ్కు దిగిన భారత్కు ఓపెనర్లు రోహిత్ (83), శుభ్మన్ గిల్ (70) శుభారంభం ఇచ్చారు. వీళ్లిద్దరూ తొలి వికెట్కు 143 పరుగులు జోడించారు. దసున్ షనక బౌలింగ్లో గిల్ ఎల్బీగా అవుట్ అయ్యాడు. కొంచెం సేపటికే హిట్మ్యాన్ బౌల్డ్ కావడంతో రెండో వికెట్ కోల్పోయింది. మధుషనక వేసిన ఓవర్లో రోహిత్ వెనుదిరిగాడు. 28 రన్స్ చేసిన అయ్యర్ మూడో వికెట్గా వెనుదిరిగాడు.