IND vs SL : సిరీస్ విజేతను నిర్ణయించే మ్యాచ్లో తొలి ఓవర్లోనే భారత్ ఓపెనర్ ఇషాన్ కిషన్ (1) వికెట్ కోల్పోయింది. మధు షనక అతడిని అవుట్ చేశాడు. ధనంజయ క్యాచ్ పట్టడంతో ఇషాన్ నిరాశగా పెవిలియన్ బాట పట్టాడు. వైడ్తో ఓవర్ ప్రారంభించిన మధుషనక శ్రీలంకకు మొదటి వికెట్ అందించాడు. రాహుల్ త్రిపాఠి క్రీజులోకి వచ్చాడు. శుభ్మన్ గిల్ (1), త్రిపాఠి (4) పరుగులతో ఆడుతున్నారు.
మూడో టీ20లో టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్ ఎంచుకుంది. మొదటి టీ 20లో ఇండియా 2 పరుగులతో గెలిచింది. రెండో టీ20లోశ్రీలకం 16 పరుగుల తేడాతో విజయం సాధించింది. సిరీస్ డిసైడర్ అయిన మూడో టీ20 రాజ్కోట్లో జరుగుతోంది.