IND vs SL : దూకుడుగా ఆడే క్రమంలో రాహుల్ త్రిపాఠి (35)అవుట్ అయ్యాడు. కరుణరత్నే బౌలింగ్లో మధుషనక క్యాచ్ అందుకోవడంతో వెనుదిరిగాడు. ఓపెనర్ శుభ్మన్ గిల్తో కలిసి త్రిపాఠి పవర్ ప్లేలో దూకుడుగా ఆడాడు. దాంతో, 5 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 39 రన్స్ చేసింది. త్రిపాఠి 16 బంతుల్లోనే 35 పరుగులు చేశాడు. మహేష్ థీక్షణ వేసిన ఐదో ఓవర్లో మూడు ఫోర్లు బాదాడు. వేగంగా ఆడే క్రమంలో కరుణరత్నే వేసిన ఆరో ఓవర్లో సిక్సర్ బాది, ఆ తర్వాత షాట్కు ప్రయత్నించాడు. కానీ, మధుషనక మెరుపు క్యాచ్ అందుకున్నాడు. సూర్యకుమార్ యాదవ్ 14, గిల్ 23 పరుగులతో క్రీజులో ఉన్నారు.
తొలి ఓవర్లోనే భారత్ ఓపెనర్ ఇషాన్ కిషన్ (1) వికెట్ కోల్పోయింది. మధు షనక బౌలింగ్లో కీపర్ ధనంజయ క్యాచ్ అందుకోవడంతో ఇషాన్ అవుట్ చేశాడు. మూడో టీ20లో టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్ ఎంచుకుంది. మొదటి టీ 20లో ఇండియా 2 పరుగులతో గెలిచింది. రెండో టీ20లోశ్రీలకం 16 పరుగుల తేడాతో విజయం సాధించింది.