IND vs SL : శ్రీలంక బౌలర్లు చెలరేగడంతో భారత్ వరుసగా వికెట్లు కోల్పోతోంది. సంజూ శాంసన్ మూడో వికెట్గా వెనుదిరిగాడు. ధనుంజయ వేసిన 7వ ఓవరల్లో అతను భారీ షాట్కు ప్రయత్నించాడు. మధుశనక క్యాచ్ పట్టడంతో శాంసన్ నిరాశగా పెవిలియన్ బాట పట్టాడు. కెప్టెన్ హార్దిక్ పాండ్యా వరుసగా బౌండరీలు బాదుతూ శ్రీలంక బౌలర్ల మీద ఒత్తిడి పెంచుతున్నాడు. దాంతో టీమిండియా స్కోర్ 50 పరుగులు దాటింది. కిషన్ 35, కెప్టెన్ పాండ్యా 17 పరుగులతో ఆడుతున్నారు. పది ఓవర్లకు 74 పరుగులు చేసిన భారత్.
అంతకుముందే కరుణరత్నే బౌలింగ్లో సూర్యకుమార్ యాదవ్ (7 పరుగులు) అవుట్ అయ్యాడు. ఓపెనర్ శుభ్మన్ గిల్ (7 పరుగులు )కూడా నిరాశ పరిచాడు. తీక్షణ బౌలింగ్లో ఎల్బీగా అవుట్ అయ్యాడు. టాస్ గెలిచిన శ్రీలంక కెప్టెన్ శనక ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. భారత పర్యటనలో ఆ జట్టు మూడు టీ20ల సిరీస్ ఆడనుంది. రెండో టీ20 జనవరి 5న, మూడో టీ20 జనవరి 7వ తేదీన జరగనున్నాయి.