IND vs SL : భారీ టార్గెట్ చేధనలో భారత్ తీవ్ర కష్టాల్లో పడింది. శ్రీలంక బౌలర్లు వెంట వెంటనే వికెట్లు తీసి టీమిండియాను ఒత్తిడిలోకి నెట్టారు. మధుశనక బౌలింగ్లో రాహుల్ త్రిపాఠి (5) మూడో వికెట్గా వెనుదిరిగాడు. అంతకుముందు రజత ఒకే ఓవర్లో ఓపెనర్లను పెవిలియన్ పంపి టీమిండియాను దెబ్బకొట్టాడు. రెండో ఓవర్ చివరి బంతికి శుభ్మన్ గిల్ (5) అవుట్ అయ్యాడు. థీక్షణ క్యాచ్ పట్టడంతో గిల్ నిరాశగా వెనుదిరిగాడు. ఓపెనర్ ఇషాన్ కిషన్ (2) అవుట్ అయ్యాడు. రజిత బౌలింగ్లో భారీ షాట్ ఆడబోయి బౌల్డ్ అయ్యాడు. ఆరంగ్రేటం చేసిన రాహుల్ త్రిపాఠి క్రీజులోకి వచ్చీ రాగానే రెండు ఫోర్లు బాది ఆత్మవిశ్వాసంతో కనిపించాడు. ప్రస్తుతం సూర్యకుమార్ యాదవ్ 0, హార్దిక్ పాండ్యా 12 పరుగులతో ఆడుతున్నారు.
సిరీస్ డిసైడర్ అయిన రెండో టీ20లో శ్రీలంక 206 పరుగుల భారీ స్కోర్ చేసింది. కెప్టెన్ దసున్ శనక అర్థ సెంచరీ(56)తో కదం తొక్కాడు. ఓపెనర్లు శాల్ మెండిస్ (54), ప్రథుమ్ నిస్సంకా (33) అసలంక( 37) రాణించారు. భారత బౌలర్లలో ఉమ్రాన్ మాలిక్ మూడు, చాహల్ రెండు వికెట్లు పడగొట్టారు. యజువేంద్ర చాహల్కు ఒక వికెట్ దక్కింది.