శ్రీలంకతో జరుగుతున్న టీ20 మ్యాచ్లో భారత జట్టు ఐదో వికెట్ కోల్పోయింది. నెమ్మదిగా తన ఇన్నింగ్స్ ఆరంభించిన స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా(17).. గేర్ మార్చే క్రమంలో పెవిలియన్ చేరాడు. శనక వేసిన 18వ ఓవర్ తొలి బంతికి సిక్సర్ బాదిన అతను.. మూడో బంతికి కూడా భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో మిడ్వికెట్ మీదుగా సిక్సర్ బాదేందుకు ట్రై చేసి ఫెయిలయ్యాడు. దీంతో డీప్ మిడ్వికెట్లో ఫీల్డింగ్ చేస్తున్న నిస్సంక క్యాచ్ పట్టేశాడు. హార్దిక్ నిరాశగా పెవిలియన్ చేరాడు.