శ్రీలంకతో జరుగుతున్న సూపర్-4 మ్యాచ్లో భారత స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్.. జట్టుకు బ్రేక్ ఇచ్చాడు. ధాటిగా ఆడుతున్న శ్రీలంక ఓపెనింగ్ జోడీని విడగొట్టాడు. అతని బౌలింగ్లో శ్రీలంక తొలి వికెట్ కోల్పోయింది. ధాటిగా ఆడుతూ ఆ జట్టు ఛేజింగ్ను ముందుండి నడిపిస్తున్న పాథుమ్ నిస్సంక (52) అవుటయ్యాడు.
చాహల్ వేసిన 12వ ఓవర్ తొలి బంతిని రివర్స్ స్వీప్ ఆడేందుకు ప్రయత్నించిన నిస్సంక.. బ్యాక్వర్డ్ పాయింట్లో రోహిత్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. దీంతో ఆ జట్టు 97 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. అదే ఓవర్లో క్రీజులోకి వచ్చిన ఆసలంక (0) డకౌట్ అయ్యాడు. చాహల్ వేసిన బంతిని భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించిన అతను విఫలమయ్యాడు. దాంతో గాల్లోకి లేచిన బంతిని సూర్యకుమార్ పట్టేయడంతో లంక జట్టు రెండో వికెట్ కోల్పోయింది.