స్కాట్లాండ్పై 86 పరుగుల విజయ లక్ష్యంతో బరిలో దిగిన భారత్ ఘన విజయం సాధించింది. ఓపెనర్లు రోహిత్ శర్మ (30), కేఎల్ రాహుల్ (50) ధాటిగా ఆడారు. దీంతో 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. స్కాట్లాండ్పై 6.3 ఓవర్లలోనే భారత్ లక్ష్యాన్ని చేధించింది.
టీమిండియా ఓపెనర్లకు పూనకం వచ్చిందేమో? పసికూన స్కాట్లాండ్పై దుమ్ముదులిపేస్తున్నారు. వీరి ధాటికి జట్టు స్కోరు నాలుగు ఓవర్లకే 50 పరుగులు దాటేసింది. తొలుత బౌలర్లు విజృంభించడంతో స్కాట్లాండ్ను 85 పరుగులకే ఆలౌట్ చేసిన భారత్కు రాహుల్ (26 నాటౌట్), రోహిత్ (26 నాటౌట్) అదిరిపోయే ఆరంభాన్నిచ్చారు.
వీరికి ఎలాంటి బంతులేయాలో తెలియక స్కాట్లాండ్ బౌలర్లు తికమక పడాల్సిన పరిస్థితి. వీరిద్దరూ బౌండరీలతో విరుచుకుపడటంతో నాలుగు ఓవర్లు ముగిసే సరికి భారత జట్టు వికెట్లేమీ నష్టపోకుండా 53 పరుగులు చేసింది. ఇదంతా చూస్తుంటే పవర్ప్లే ముగిసే సరికి భారత్ ఈ మ్యాచ్ గెలిచేలా కనబడుతోంది.
పసికూన స్కాట్లాండ్పై భారత బౌలర్లు ప్రతాపం చూపారు. నిప్పులు చెరిగే బంతులతో స్కాట్లాండ్ బ్యాట్స్మెన్ను బెంబేలెత్తించారు. ఆరంభంలోనే ఆ జట్టులో ఓపెనర్ జార్జ్ మున్సే (24)ను అవుట్ చేసిన పేసర్ మహమ్మద్ షమీ 17వ ఓవర్లో విశ్వరూపమే చూపాడు.
తొలి బంతికి కాలమ్ మెక్లాయిడ్ (16)ను బౌల్డ్ చేశాడు. ఆ తర్వాతి బంతికే సఫ్యాన్ షరీఫ్ (0) రనౌటయ్యాడు. మూడో బంతికి అద్భుతమైన డెలివరీతో అలస్దైర్ ఇవాన్స్ (0)ను పెవిలియన్ చేర్చాడు. ఆ ఓవర్ ముగిసే సరికి 83/9తో ఉన్న స్కాట్లాండ్ కథను ఆ తర్వాతి ఓవర్లో బుమ్రా ముగించాడు.- Advertisement –
బాణం వంటి యార్కర్తో మార్క్ వాట్ (14)ను క్లీన్ బౌల్డ్ చేశాడు. దీంతో 17.4 ఓవర్లలో 85 పరుగులకు స్కాట్లాండ్ ఆలౌట్ అయింది. భారత బౌలర్లలో షమీ, జడేజా చెరో మూడు వికెట్లు తీసుకున్నారు. బుమ్రా రెండు వికెట్లు పడగొట్టగా, అశ్విన్ ఒక వికెట్ కూల్చాడు.
మళ్లీ జడేజానే. డ్రింక్స్ విరామం తర్వాత షమీ వేసిన ఓవర్లో స్కాట్లాండ్ బ్యాట్స్మెన్ లీస్క్ (21) ఒక సిక్స్, ఒక ఫోర్ కొట్టి సత్తా చాటాడు. అతను నిలబడితే ఆ జట్టు పోరాడే స్కోరు చేయగలిగేలా కనిపించింది. అలాంటి సమయంలోనే తన తొలి ఓవర్లోనే రెండు వికెట్లు కూల్చిన జడ్డూను మరోసారి కోహ్లీ నమ్ముకున్నాడు.
కెప్టెన్ నమ్మకాన్ని నిలబెట్టుకున్న జడేజా.. రెండో బంతికే లీస్క్ను ఎల్బీగా పెవిలియన్ చేర్చి భారత్కు మరోసారి బ్రేక్ ఇచ్చాడు. దీంతో 12 ఓవర్లకు స్కాట్లాండ్ జట్టు 60/5 స్కోరుతో నిలిచింది.
పసికూన స్కాట్లాండ్పై భారత బౌలర్లు విజృంభిస్తున్నారు. బుమ్రా, షమీ ఇప్పటికే చెరో వికెట్ తీసుకుని సత్తా చాటారు. ఆ వెంటనే రవీంద్ర జడేజా మరో రెండు వికెట్లు కూల్చాడు. ఏడో ఓవర్లో బంతి అందుకున్న జడ్డూ.. మూడో బంతికే రిచీ బెర్రింగ్టన్ (0)ను క్లీన్బౌల్డ్ చేశాడు.
అదే ఓవర్ చివరి బంతికి మెక్లాయిడ్ (2)ను కూడా ఎల్బీగా పెవిలియన్ పంపాడు. దీంతో స్కాట్లాండ్ జట్టు 29/4తో పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది.
స్కాట్లాండ్తో జరుగుతున్న మ్యాచ్లో జస్ప్రీత్ బుమ్రా తొలి వికెట్ తీశాడు. బ్యాటింగ్ చేయడానికి ఇబ్బంది పడుతున్న స్కాట్లాండ్ సారధి కైల్ కోట్జర్ (1)ను క్లీన్బౌల్డ్ చేశాడు.
దీంతో 13 పరుగుల వద్ద స్కాట్లాండ్ తొలి వికెట్ కోల్పోయినట్లయింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన కోహ్లీ ఫీల్డింగ్ ఎంచుకున్న సంగతి తెలిసిందే. భారత జట్టులో శార్దూల్ ఠాకూర్ స్థానంలో వరుణ్ చక్రవర్తి జట్టులోకి వచ్చాడు. స్కాట్లాండ్ జట్టులో ఎటువంటి మార్పులూ లేవు.
దుబాయ్: టీమిండియా సారధి విరాట్ కోహ్లీపై ఎట్టకేలకు అదృష్టదేవత దయచూపింది. అతనికి బర్త్డే గిఫ్ట్ అందించింది. ఇప్పటి వరకూ ఈ టీ20 ప్రపంచకప్లో ఒక్కసారి కూడా టాస్ గెలవని కోహ్లీ.. స్కాట్లాండ్తో మ్యాచ్లో టాస్ గెలిచాడు. టాస్ గెలిచిన తర్వాత కోహ్లీ చిరునవ్వులు చిందిస్తూ కనిపించాడు. మంచు ప్రభావం వల్లనే ముందు ఫీల్డింగ్ ఎంచుకుంటున్నామంటూ జోకులు పేల్చాడు.
శుక్రవారం కోహ్లీ జన్మదినం రోజునే స్కాట్లాండ్తో మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన కోహ్లీ.. ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. అలాగే జట్టులో ఒక మార్పు జరిగినట్లు కోహ్లీ చెప్పాడు. శార్దూల్ ఠాకూర్ స్థానంలో వరుణ్ చక్రవర్తి ఆడుతున్నట్లు వెల్లడించాడు. స్కాట్లాండ్ జట్టులో ఎటువంటి మార్పులూ లేవు. న్యూజిల్యాండ్పై ఆడిన జట్టుతోనే స్కాట్లాండ్ బరిలో దిగుతోంది.
భారత జట్టు: కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషభ్ పంత్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అశ్విన్, మహమ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి
స్కాట్లాండ్: జార్జ్ మున్సే, కైల్ కోట్జర్, కాలమ్ మెక్లాయిడ్, రిచీ బెర్రింగ్టన్, మైకేల్ లీస్క్, మాథ్యూ క్రాస్, క్రిస్ గ్రీవ్స్, మార్క్ వాట్, సఫ్యాన్ షరీఫ్, అలాస్దైర్ ఇవాన్స్, బ్రాడ్ వీల్