దుబాయ్: ఈ టీ20 ప్రపంచకప్లో తొలిసారి టాస్ గెలిచిన కోహ్లీ.. మరో ఆలోచన లేకుండా బౌలింగ్ ఎంచుకున్నాడు. కోహ్లీ నిర్ణయాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకున్న భారత బౌలర్లు.. పసికూన స్కాట్లాండ్పై పట్టుబిగించారు. ఏ బ్యాట్స్మెన్ను కూడా భారీ షాట్లు ఆడనివ్వని బౌలర్లు వరుస విరామాల్లో వికెట్లు కూల్చుతూ స్కాట్లాండ్ జట్టును ఒత్తిడిలోకి నెట్టారు. దీంతో స్కాట్లాండ్ జట్టు ఏ దశలోనూ కోలుకునేలా కనిపించలేదు.
స్కాట్లాండ్ బ్యాట్స్మెన్లలో జార్జ్ మున్సే (24) ఒక్కడే కొంచెం ఆడాడు. మిగతా వారు కైల్ కోట్జర్ (1), మాథ్యూ క్రాస్ (2), రిచీ బెర్రింగ్టన్ (0) భారత బౌలర్లను ఏమాత్రం ఎదుర్కోలేకపోయారు. దీంతో పది ఓవర్లు ముగిసేసరికి స్కాట్లాండ్ జట్టు 44/4 స్కోరుతో తిప్పలు పడుతోంది.