దుబాయ్: స్కాట్లాండ్తో జరుగుతున్న మ్యాచ్లో జస్ప్రీత్ బుమ్రా తొలి వికెట్ తీశాడు. బ్యాటింగ్ చేయడానికి ఇబ్బంది పడుతున్న స్కాట్లాండ్ సారధి కైల్ కోట్జర్ (1)ను క్లీన్బౌల్డ్ చేశాడు.
దీంతో 13 పరుగుల వద్ద స్కాట్లాండ్ తొలి వికెట్ కోల్పోయినట్లయింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన కోహ్లీ ఫీల్డింగ్ ఎంచుకున్న సంగతి తెలిసిందే. భారత జట్టులో శార్దూల్ ఠాకూర్ స్థానంలో వరుణ్ చక్రవర్తి జట్టులోకి వచ్చాడు. స్కాట్లాండ్ జట్టులో ఎటువంటి మార్పులూ లేవు.