IND vs SA | దక్షిణాఫ్రికా గడ్డపై తొలి టెస్టులో టీమ్ మేనేజ్మెంట్ సీనియారిటీకే ఓటేసింది. న్యూజిల్యాండ్తో సిరీస్లో టెస్టుల్లో అదిరిపోయే అరంగేట్రం చేసిన శ్రేయాస్ అయ్యర్ను పక్కనపెట్టి.. ఫామ్ లేక తంటాలు పడుతున్న రహానేకు ఛాన్స్ ఇచ్చింది. సెంచూరియన్ వేదికగా దక్షిణాఫ్రికా, భారత్ జట్ల మధ్య తొలి టెస్టు ప్రారంభమైంది. ఈ మ్యాచ్లో ఆడే 11 మంది బృందాన్ని టీమిండియా వెల్లడించింది.
కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్ ఓపెనర్లుగా బరిలోకి దిగనున్నారు. ఆ తర్వాత కోహ్లీ, ఛటేశ్వర్ పుజారా, అజింక్య రహానే, రిషభ్ పంత్, రవిచంద్రన్ అశ్విన్, మహమ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్, శార్దూల్ ఠాకూర్ ఈ మ్యాచ్ ఆడుతున్నట్లు టీమ్ మేనేజ్మెంట్ ప్రకటించింది. ఈ మ్యాచ్లో అగర్వాల్, రాహుల్ కలిసి జట్టుకు మంచి ఆరంభాన్ని అందించారు. 18 ఓవర్లు ముగిసే సరికి జట్టుస్కోరు 52/0గా నిలిచింది. అగర్వాల్ (36 నాటౌట్), రాహుల్ (16 నాటౌట్) స్కోరుతో ఆడుతున్నారు.
Captain @imVkohli wins the toss and #TeamIndia will bat first.
— BCCI (@BCCI) December 26, 2021
A look at our Playing XI for the 1st Test.#SAvIND pic.twitter.com/DDACnaXiK8