IND vs SA | గౌహతి వేదికగా భారత్తో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్లో పూర్తి ఆధిక్యంలో ఉన్న దక్షిణాఫ్రికా 260/5 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. ఓవర్నైట్ స్కోర్ 26/0తో నాలుగో రోజు ఆట ప్రారంభించిన సఫారీల జట్టు.. లంచ్ బ్రేక్ అనంతరం డిక్లేర్ ప్రకటించింది.
ఇప్పటికే తొలి ఇన్నింగ్స్లో 289 పరుగుల ఆధిక్యంలో ఉంది. ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్లో 260 పరుగులు చేయడంతో దక్షిణాఫ్రికా 548 పరుగుల ఆధిక్యంలో ఉంది. అంటే.. ఈ టెస్ట్లో టీమిండియా గెలవాలంటే 549 పరుగుల టార్గెట్ చేధించాల్సి ఉంది.
Innings Break!
South Africa have declared their innings on 260/5.#TeamIndia need 549 runs to win.
Scorecard ▶️ https://t.co/Hu11cnrocG#INDvSA | @IDFCFIRSTBank pic.twitter.com/QCV3zea51c
— BCCI (@BCCI) November 25, 2025