సౌతాఫ్రికాతో జరుగుతున్న మూడో టీ20లో భారత జట్టు మరోసారి తడబడింది. రుతురాజ్ గైక్వాడ్ (57), ఇషాన్ కిషన్ (54) ఇద్దరూ అర్ధశతకాలతో రాణించడంతో భారత్కు అద్భుతమైన ఆరంభం లభించింది. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగినప్పటికీ.. ఓపెనర్లు ధాటిగా ఇన్నింగ్స్ ప్రారంభించడంతో టీమిండియా భారీ స్కోరు చేస్తుందనిపించింది.
కానీ ఆ తర్వాత వచ్చిన శ్రేయాస్ అయ్యర్ (14), రిషభ్ పంత్ (6) ఇద్దరూ విఫలమయ్యారు. 19వ ఓవర్లో గేరు మార్చే ప్రయత్నంలో దినేష్ కార్తీక్ (6) కూడా అవుటయ్యాడు. క్రీజులో ఉన్న హార్దిక్ పాండ్యా (31 నాటౌట్) నాలుగు బౌండరీలు బాదడంతో.. భారత్ పోరాడే స్కోరు చేసింది. నిర్ణీత 20 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా 5 వికెట్ల నష్టానికి 179 పరుగులతో నిలిచింది.
సౌతాఫ్రికా బౌలర్లలో ప్రిటోరియస్ రెండు వికెట్లు తీయగా.. రబాడ, షంసీ, కేశవ్ మహరాజ్ తలో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు. బ్యాటింగ్కు సహకరిస్తున్న పిచ్పై సఫారీలు ఈ టార్గెట్ ఛేదించకుండా భారత బౌలింగ్ దళం అడ్డుకుంటుందేమో చూడాలి.