IND vs SA | టాప్ఆర్డర్లు, మిడిలాడర్లు విఫలమైన వేళ సూర్యకుమార్ యాదవ్ ఒంటరి పోరాటం చేశాడు. వరుస వికెట్లు కోల్పోతూ కష్టాల్లో ఉన్న టీమిండియాకు కీలక పరుగులను అందించాడు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లు ముగిసేసరికి భారత్ 9 వికెట్ల నష్టానికి 133 పరుగులు చేసింది. సఫారీల ముందు ఓ మోస్తరు లక్ష్యాన్ని ఉంచింది.
తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన టీమిండియాకు మొదట్నుంచి షాక్లు తగులుతూనే ఉన్నాయి. ఐదు ఓవర్లు కూడా ముగియకముందే ఓపెనర్లు రోహిత్ శర్మ (15), కేఎల్ రాహుల్ (9) ఔటయ్యారు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన విరాట్ కోహ్లీ (12) దూకుడుగా మ్యాచ్ ఆరంభించినప్పటికీ ఎక్కువసేపు క్రీజులో నిలవలేకపోయాడు. బౌండరీ లైన్ వద్ద రబాడా అద్భుతంగా క్యాచ్ పట్టడంతో ఔటయి పెవిలియన్ చేరాడు. యంగ్ బ్యాటర్ దీపక్ హుడా (౦), హార్దిక్ పాండ్యా (2) దారుణంగా విఫలమయ్యారు. వరుస వికెట్లు కోల్పోతూ కష్టాల్లో ఉన్న టీమిండియాకు పరుగులు తెచ్చే బాధ్యతను సూర్యకుమార్ యాదవ్ తన భుజాల మీద వేసుకున్నాడు. ఒక్కడే 68 పరుగులు చేశాడు. అతనికి కాసేపు దినేశ్ కార్తిక్ అండగా నిలబడ్డాడు. దినేశ్ కార్తీక్ (6) ఔటయ్యాక క్రీజులోకి వచ్చిన అశ్విన్ (7) కూడా విఫలమయ్యాడు. సూర్యకుమార్ (68) ఔటయ్యాక వచ్చిన బౌలర్లు ఎవరూ సత్తా చూపలేకపోయారు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లు ముగిసేసరికి టీమిండియా 13౩ పరుగులకే పరిమితమైంది. దక్షిణాఫ్రికా బౌలర్లలో లుంగి ఎంగిడి 4 వికెట్లు, పార్నెల్ 3, అన్రిచ్ నోర్ట్జే ఒక వికెట్ తీశాడు.