విశాఖపట్టణం వేదికగా జరుగుతున్న మూడో టీ20లో భారత ఓపెనర్లు శుభారంభం చేశారు. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన జట్టుకు అదిరే ఆరంభం అందించారు. ముఖ్యంగా రుతురాజ్ గైక్వాడ్ (23 బంతుల్లో 44 నాటౌట్) ఎడాపెడా బౌండరీలతో చెలరేగాడు. అతనికి ఇషాన్ కిషన్ (13 బంతుల్లో 13 నాటౌట్) సహకరించాడు.
ఎక్కువగా అతనికే స్ట్రైకింగ్ ఇస్తూ వచ్చాడు. ఈ అవకాశాన్ని చక్కగా ఉపయోగించుకున్న రుతురాజ్.. నోర్జీ వేసిన ఐదో ఓవర్లో ఐదు బౌండరీలతో చెలరేగాడు. దీంతో పవర్ప్లే ముగిసే సరికి భారత జట్టు వికెట్లేమీ నష్టపోకుండా 57 పరుగులు చేసింది.
End Of Powerplay!
A cracking opening stand between @Ruutu1331 & @ishankishan51. 👍 👍#TeamIndia move to 57/0.
Follow the match ▶️ https://t.co/mcqjkCj3Jg #INDvSA | @Paytm pic.twitter.com/WVMiz3lKYv
— BCCI (@BCCI) June 14, 2022